మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు. పౌరసత్వ సవరణ బిల్లు దేశ పునాదులు ధ్వంసం చేస్తుందని ధ్వజమెత్తారు. పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడిగా ఆయన వర్ణించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన పార్టీ పౌరసత్వ బిల్లుకు మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పౌరసత్వ సవరణ బిల్లు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లుకు ఇచేవాళ్లు దేశ వ్యవస్థీకృత విధానంపై దాడి చేసినట్లే అని రాహుల్ గాంధీ ట్విట్టర్లో అన్నారు. శివసేన నాయకులు మాత్రం దేశ ప్రయోజనాల కోసమే బిల్లుకు మద్దతు ఇచ్చామని పేర్కొన్నారు.
The #CAB is an attack on the Indian constitution. Anyone who supports it is attacking and attempting to destroy the foundation of our nation.
— Rahul Gandhi (@RahulGandhi) December 10, 2019