రాష్ట్రపతి భవన్లో లోక్సభ ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎంపీ వీరేంద్రకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. లోక్సభలో ఎంపీలతో వీరంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జూన్ 19న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ప్రొటెం స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేసిన వీరేంద్రకుమార్ కి రాష్ట్రపతి కోవింద్,ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. 17వ లోక్సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జూలై 5న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.