ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్ధిక ప్యాకేజీ ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా ఈరోజు మరిన్ని రంగాలకు ఇచ్చే వేసులుబాట్లను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ ప్రకటించారు.
ముద్రా రుణాలకు వడ్డీ రాయితీ..
- ముద్ర పథకం కింద ₹50 వేలలోపు చిన్నరుణాలు తీసుకున్నవారికి వడ్డీ రాయితీ ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
- మారటోరియం అనంతరం ముద్ర రుణాలపై రెండు శాతం వడ్డీ రాయితీ ఉంటుంది.
- వీధి వ్యాపారులకు రుణ సదుపాయం కల్పిస్టారు.
- 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ₹5 వేల కోట్ల రుణ సాయం.
- ఒక్కొక్కరికీ ₹10 వేలు చొప్పున వర్కింగ్ కేపిటల్ కింద రుణం మంజూరు చేస్తారు.
- మధ్య ఆదాయ వర్గాలకు గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం మరో ఏడాది పొడిగిస్తారు. ₹6 లక్షల నుంచి ₹18 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది.
అడవుల పరిరక్షణ కోసం 'క్యాంపా'
- అడవుల పరిరక్షణ, మొక్కలు నాటేందుకు నూతన పథకం తీసుకువస్తున్నారు.
- ఆరు వేల కోట్లతో గిరిజనులకు ఉపాధి కల్పించేలా 'క్యాంపా' పథకం ఉంటుంది.
- దీని ద్వారా గిరిజనులకు నగదు అందుబాటులోకి వస్తుంది. పథకం అమలు రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణపై ఆధారపడి ఉంటుంది.