కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి మోడీకి ఆహ్వానం

ముచ్చటగా మూడోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రాం లీలా మైదానంలో ఫిబ్రవరి 16న అయన ప్రమాణ స్వీకారం జరుగుతుంది.

Update: 2020-02-14 11:40 GMT

ముచ్చటగా మూడోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రాం లీలా మైదానంలో ఫిబ్రవరి 16న అయన ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ మేరకు ప్రధాని మోడీకి గురువారం ఆహ్వానం పంపించినట్లుగా ఆప్ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై అధికారిక ప్రకటన వెలుబడాల్సింది.ఇక ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కేబినేట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇక వేడుకకి మరే రాష్ట్రానికి చెందినా రాజకీయనాయకులను ఆహ్వానించడం లేదని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ముందుగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాలని ఆప్ భావించింది. కానీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికలలో అమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ 08స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాతా కూడా తెర్చుకోలేదు. 

Tags:    

Similar News