కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టంపై ఉంచినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తులు సరిగ్గా పని చేయడం లేదని...ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నారు. ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రాన్ ఆక్సిజనేషన్ను అమర్చినట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు జైట్లీ ఆరోగ్యం గురించి ఎయిమ్స్వైద్యులు ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు.