పశ్చిమ బెంగాల్లో వరుస రాజకీయ హత్యలు జరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఘర్షణల్లో ఇప్పటికే ముగ్గురు చనిపోగా తాజాగా బీజేపీ కార్యకర్త ఆశిష్ సింగ్ దారుణ హత్యకు గురయ్యారు. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన సింగ్ మాల్దాలోని ఓ ప్రాంతంలో శవమై కనిపించాడు. అతడి శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో స్థానిక ఇంగ్లీష్ బజార్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. తమ పార్టీ నేతలు ఇలా వరుసగా దారుణ హత్యలకు గురవుతున్నారంటూ బిజెపి ఆందోళనకు దిగింది. సోమవారం బ్లాక్ డే' నిర్వహించిన బిజెపి ఇవాళ కూడా నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.