మరోసారి మానవత్వం చాటుకున్నారు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్.. పుల్వామా దాడిలో చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు అయన 2.5 కోట్లు అందజేసారు .. ఒక్కో అమర జవాన్ల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నగదును ఆయన అందజేశారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగులో వెల్లడించారు. పుల్వామా ఉగ్రవాద దాడిలో 49 మంది జవాన్లు అమరులయ్యారు. దీనికి ముందు ముంబై లోని 2,100 మంది రైతుల రుణమాఫీని ఆయనే తీర్చారు .. అంతకుముందు ఉత్తరప్రదేశ్ లోని కొందరు రైతులను అమితాబ్ ఆదుకున్నారు .. అమితాబ్ చేసిన ఈ మంచి పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ..