మోదీ, అమిత్‌ షా కృష్ణార్జునులు: రజనీ

Update: 2019-08-11 07:52 GMT

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం భారత్‌కు, కశ్మీరీ ప్రజలకు శుభపరిణామం అన్నారు. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ పొగడ్తల వర్షం కురిపించారు. వీరిద్దరూ కృష్ణార్జనుల వంటివారని, మోదీ ఏదైనా చెబితే, దాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా అమిత్ షా కృషి చేస్తారని అన్నారు. కశ్మీర్ అంశంపై వారిద్దరి వైఖరి, ఆర్టికల్ 370లను ప్రస్తావించిన రజనీకాంత్, ఈ విషయంలో తనకు చాలా సంతోషం కలిగిందని, వారిద్దరూ కలిసి కాశ్మీర్ ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయడంలో విజయవంతం అయ్యారని అన్నారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. చెన్నైలోని కలైవనర్‌ ఆరంగం వేదికగా ఆదివారం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.  

Tags:    

Similar News