ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్ పర్యటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం సర్వాంగ సుందరంగా మారింది. అహ్మదాబాద్ నగరంలోని మోతేరా స్టేడియంలో జరిగే నమస్తే ట్రంప్ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ట్రంప్ రాక అహ్మదాబాద్ నగరానికే గర్వకారణమని స్థానికులు భావిస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేయడం వల్ల స్థానికులెందరికో ఉపాధి లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.