AIIMSలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
నర్సింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలనుకున్న విద్యార్థుల కోసం న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
నర్సింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలనుకున్న విద్యార్థుల కోసం న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020 సంవత్సరానికి గానూ బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. బీఎస్సీ కోర్సుకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హ, ఎంఎస్సీ కోర్సుకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కోర్సుల వివరాల్లోకెళితే
యూజీ కోర్సులు..
♦ బీఎస్సీ(హానర్స్) నర్సింగ్
♦ బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్మెట్రిక్)
♦ బీఎస్సీ (పారామెడికల్)
విద్యార్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పీజీ కోర్సులు
♦ ఎంఎస్సీ నర్సింగ్
♦ ఎంఎస్సీ (బయోటెక్నాలజీ)
విద్యార్హత : సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ పద్ధతిలో
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.