ఇకపై ఆధార్ కార్డ్ గుర్తింపు కార్డుగా వినియోగించుకునే అవకాశం కలిగింది. గురువారం ఈ మేరకు ఆధార్ చట్ట సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. అయితే, దీనికి ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. గత ప్రభుత్వం చట్టాల కోసం ఆర్డినెన్స్ లు జారీ చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఆర్డినెన్స్ లనే చట్టాలుగా మారుస్తోందని కాంగ్రెస్ నేత రంజన్ చౌదరి ఈ సందర్భంగా అన్నారు. మరో పక్క ఈ బిల్లులో పారదర్శకత లోపించిందని తృణమూల్ కాంగ్రెస్స్ చెప్పింది.
ఈ చట్ట సవరణతో బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్లు తీసుకునేందుకు స్వచ్చందంగా ఆధార్ ను వినియోగించుకునే వెసులుబాటు ప్రజలకు కలగుతుంది. అదేసమయంలో ఆధార్ కార్డు కోసం ఆయా సంస్థలు వినియోగదారుని ఒత్తిడి చేయడానికి వీలు వుండదు.