బస్సు కోసం ఎదురుచూస్తున్న యువతి.. కిడ్నాప్ చేసి బలవంతంగా తాళి కట్టిన యువకుడు
పెళ్లికి ఒప్పుకోలేదని మరదలి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. కర్ణాటకలోకి హసన్ జిల్లాలో జరిగిందీ ఘటన. బాధితురాలు (23) బస్స్టాప్లో ఎదురుచూస్తున్న సమయంలో కొందరు యువకులు కారులో అక్కడికి చేరుకున్నారు. అందరూ చూస్తుండగానే బలవంతంగా ఆమెను కారులోకి ఎక్కించారు. అనంతరం యువతికి బావ వరుస అయ్యే మను (30) అనే యువకుడు ఆమె మెడలో తాళి కట్టాడు.
బాధిత యువతి ఎంత పెనుగులాడినా ఫలితం లేకుండా పోయింది. మనుకి మరో ఇద్దరు సహకరించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతిని మను తన స్నేహితుడి వద్ద దాచినట్లు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.