Uttar Pradesh: తండ్రి కోరిక మేర‌కు.. దిష్టిబొమ్మను పెళ్లి చేసుకున్న యువకుడు

Update: 2020-06-19 06:46 GMT

కన్న తండ్రి కోసం ఓ యువకుడు అమ్మాయిని పోలిన దిష్టిబొమ్మ‌ను వివాహం చేసుకున్నాడు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రయాగ్ రాజ్‌ సమీపంలోని భైద్పూర్ గ్రామానికి చెందిన శివమోహన్ అనే 90 వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటుంది. శివమోహన్ పాల్ కు తొమ్మిది మంది పిల్లలు. ఎనిమిదిమంది పిల్లలకు పెళ్లిలు చేశాడు. ఇక చిన్నకొడుకు పంచరాజ్(32)కు ఇంకా వివాహం జరగలేదు. తాను బతికి ఉండగానే కొడుకు వివాహం చేయాలని అనుకున్నాడు.

అతడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నందున ఎవరూ పిల్లను ఇచ్చేందుకు ముందుకురాలేదు. ఇక చేసేదేమి లేక ఓ దిష్టిబొమ్మను తయారు చేసి చీరకట్టి పెళ్లి పీటలపై కూర్చొబెట్టి తాళి కట్టించాడు. మొదట పంచరాజ్ ఈ పెళ్లిని తిరస్కరించాడు. చివరకు తండ్రి కోరిక కాదనలేక ఆ బొమ్మను పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం.. వివాహం జ‌రిపించి.. తండ్రి త‌న ముచ్చ‌ట తీర్చుకున్నాడు. వివాహ వేడుక‌కు హాజ‌రైన వారంద‌రికీ కూడా విందు ఏర్పాటు చేశారు.
 

 

Tags:    

Similar News