ఢిల్లీలో 24 గంటల్లో 660 కరోనా కేసులు

Update: 2020-05-22 09:43 GMT
Representational Image

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 660 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,319కి పెరిగింది. 

ప్రస్తుతం 6,214 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా గత 24 గంటల్లో మరో 14 మంది మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఇక్కడ మొత్తం కరోనా మరణాల సంఖ్య 208కి చేరుకోగా.. ఇప్పటి వరకు 5,897 మంది విజయవంతగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.



 


Tags:    

Similar News