భారత్లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 6,535 కేసులు నమోదు కాగా, 146 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,380కి చేరింది. వీరిలో 60,490 మంది కోలుకోగా.. 80,722 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మరణాల సంఖ్య మొత్తం 4,167కి చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది.