భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

Update: 2019-08-06 03:50 GMT

ఢిల్లీ జకీర్ నగర్‌‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 20 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం జరిగిన భవనం నుంచి 20 మందిని భవనం నుంచి వెలుపలికి తీసుకువచ్చారు. భారీగా ఎగిసిపడిన మంటలతో అక్కడ పార్క్‌ చేసిన ఏడు కార్లు, ఎనిమిది బైక్‌లు దగ్ధమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని తెలిపారు.

Tags:    

Similar News