మధ్యప్రదేశ్కు చెందిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తనతో ఫోన్లో టచ్లో ఉన్నారని మధ్యప్రదేశ్కు చెందిన ఆధ్మాత్మిక వేత్త నాందాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా అన్నారు. మధ్యప్రదేశ్ పార్టీ నాయకత్వం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ గ్రీన్సిగ్నల్ లభిస్తే బీజేపీ ఎమ్మెల్యేల పేర్లు వెల్లడిస్తానని కంప్యూటర్ బాబా చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం పడిపోయిన అనంతరం బీజేపీ కన్ను మధ్యప్రదేశ్పై పడిందనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం కమల్నాథ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్షాస్మృతి బిల్లుకు మద్దుతుగా ఓటేసిన నేపథ్యంలో..తాజాగా కంప్యూటర్ బాబా నలుగురు ఎమ్మెల్యేల అంశం తెరపైకి తేవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.