Coronavirus Updates: భారత్‌లో కొత్తగా 10,974 కరోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-06-17 04:29 GMT

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 10,974 కేసులు నమోదు కాగా, 2003 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 3,54,065 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,55,227 ఉండగా, 1,86,935 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 11,903 మంది కరోనా వ్యాధితో మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,13,445 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 5,537 మంది చనిపోయారు. తమిళనాడులో 48,019 కేసులు(మృతులు 528), ఢిల్లీలో 44,688(మృతులు 1,837), గుజరాత్‌లో 24,628(మృతులు 1,534) పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 

Tags:    

Similar News