బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు..13 మంది సజీవదహనం, 50 మందికి తీవ్ర గాయాలు
పంజాబ్ గురుదాస్పూర్లోని బట్టాల ప్రాంతంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం అమరీందర్సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.