Shaakuntalam: భయంతో సినిమా ప్రీమియర్స్ ఆపేసిన "శాకుంతలం" బృందం..

Shaakuntalam: ప్రీమియర్స్ ను క్యాన్సల్ చేసిన "శాకుంతలం" బృందం..

Update: 2023-04-13 07:06 GMT

Shaakuntalam: భయంతో సినిమా ప్రీమియర్స్ ఆపేసిన "శాకుంతలం" బృందం..

Shaakuntalam: స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా గుణ శేఖర్ దర్శకత్వంలో నటించిన "శాకుంతలం" సినిమా. ఈనెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా తమిళ్, కన్నడ, మలయాళం, మరియు హిందీ భాషల్లో కూడా విడుదల కి సిద్ధమవుతోంది. చిత్ర బృందం ఈ సినిమాని త్రీడీలో కూడా విడుదల చేస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి భారీ స్థాయిలో స్పెషల్ ప్రీమియర్స్ ను కూడా ఏర్పాటు చేసింది చిత్రం బృందం.

శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాకి ముందుగానే సోమ, బుధ మరియు గురువారాల్లో ఇండస్ట్రీ మరియు మీడియా సర్కిల్స్ కోసం స్పెషల్ ప్రీమియర్స్ ను ప్లాన్ చేసింది చిత్రం బృందం. కానీ సోమవారం నాడు జరిగిన ప్రీమియర్ షోలకి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి చిత్తబృందం కూడా షాక్ అయింది. సినిమాకి మిక్స్ టాక్ వస్తుండడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ప్రీమియర్ ప్లాన్లను రద్దు చేసింది చిత్ర బృందం. దీంతో ఇవాళ అనగా బుధవారం మరియు రేపు అనగా గురువారం నాడు జరగాల్సిన ప్రీమియర్స్ ను కూడా చిత్ర బృందం క్యాన్సిల్ చేసింది.

దేవ్ మోహన్ ఈ సినిమాలో దుష్యంతుడి పాత్ర పోషిస్తుండగా, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో కనిపించనుంది. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధు, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags:    

Similar News