దిల్ రాజు ఆఫీసులో ఐటీ సోదాలు

Update: 2019-05-09 01:31 GMT

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన కార్యాలయాల్లో ఆదాయం పన్నుశాఖ అధికారులు తనికీలు నిర్వహించారు. ఐటీ అధికారుల బృందం బుధవారం ఉదయం శ్రీనగర్‌కాలనీలోని దిల్ రాజు కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేపట్టింది. రికార్డులు, ఆదాయ, వ్యయాలను పరిశీలించి పలు పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్టు తెలుస్తోంది. గురువారం ఆయన నిర్మించిన మహర్షి సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఐటీ సోదాలపై దిల్ రాజు స్పందించారు.. ఇవి రొటీన్‌గా జరిగే వ్యవహారమే అని, వారు కోరిన పత్రాలు ఇచ్చినట్టు తెలిపారు. 

Similar News