జర్నలిస్ట్ గా మారనున్న హాట్ యాంకర్

Update: 2019-03-07 05:39 GMT

ఒకవైపు యాంకర్గా టెలివిజన్ ఇండస్ట్రీలో రాణిస్తూనే మరోవైపు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. ఈ మధ్యనే 'యాత్ర' సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన ఈమె ప్రస్తుతం 'కథనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనసూయ ఒక సరికొత్త అవతారంలో కనిపించనుంది. 'క్షణం' మూవీ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించిన అనసూయ 'కథనం' సినిమాలో జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీజర్ ను ఈ నెల 8 వ తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు రాజేష్ నాదెండ్ల. నటుడు మరియు దర్శకుడు అయిన శ్రీనివాస్ అవసరాల మరియు కమిడియన్ ధనరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. గాయత్రి ఫిలిమ్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆసక్తికరమైన పాత్రలను ఎంచుకోవడంలో అనసూయ ముందు ఉంటుంది. ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న అనసూయ 'కథనం' సినిమాతో హిట్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

Similar News