సినీ నటి పూనమ్ కౌర్ మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్యా ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దాదాపు 50 యూట్యూబ్ ఛానెళ్లలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆమె వాటిపై ఫిర్యాదు చేశారు.యూట్యూబ్లో ఉద్దేశపూర్వకంగా తనపై అసభ్యకరమైన వీడియోలు పోస్టు చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. తనను కించపరిచేవిధంగా, నా వ్యక్తిత్వాన్ని అవమానించేలా యూట్యూబ్లో కొందరు పోస్టులు పెడుతున్నారని, తనపై లేనిపోని పుకార్లు సృష్టించి.. దుష్ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని నటి పూనమ్ కౌర్ సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.