ఉదయం బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్డు తీసుకుకోవడం చాలా మందికి అలవాటు. బ్రెడ్డు మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పడు మనం ఆహరం కారణంగా ఉదర సంబంధ సమస్యలతోపాటు డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం మనం తీసుకునే కొన్ని అనవసరపు ఆహారపు అలావాట్లే కారణమంటున్నారు నిపుణులుముఖ్యంగా బ్రెడ్, పాస్తాలాంటివి ఎక్కువగా తీసుకునే వారిలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు పరిశోధకులు. బ్రెడ్డులో గ్లూటెనే ఈ సమస్యకు కారణమని వారు స్పష్టం చేస్తున్నారు. ఇది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటున్నారు. ఇది అందరికి జరగకపోవచ్చని కొంత మందిపై మాత్రం దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే ఉపశమనం పోందడానికి కోన్ని పరిష్కారాలను తెలిపారు. బ్రెడ్ తిన్న తరువాత పళ్ళు తీసుకుంటే ఈ సమస్య నుంచి కొంత వరకూ తప్పించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.