మైగ్రేన్ ఆ బాధ ఎంతో కష్టమో.. బరించే వారికే తెలుస్తుంది. మైగ్రేన్ తగ్గటానికి చాలమంది అనేక రకాల మందులు వాడుతుంటారు. అయితే మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందాలంటే సన్ ప్లవర్ చక్కటి పరిష్కారం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొద్దు తిరుగుడు గింజలను.. పొద్దు తిరుగుడు ఆకురసంతో నూరి ముద్దగా చేసి మూడు రోజులు వరుసగా నుదుటి మీద పట్టివేస్తే మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
సన్ ఫ్లవర్ గింజలు ఇన్సులిన్ నిరోధానికి సాయపడుతూ మధుమేహం రాకుండా అడ్డుకుంటాయి అంటున్నారు నిపుణులు. పొద్దుతిరుగుడు గింజలు థైరాయిడ్ను దరిచేరనివ్వదు. ఇంకా పొద్దుతిరుగుడు గింజలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా హానికర ఫ్రీరాడికల్స్ విడుదలను అడ్డుకుంటాయి. తద్వారా క్యాన్సర్, హృద్రోగాలకు దూరం చేసుకోవచ్చు. పొద్దు తిరుగుడు గింజలు, నూనెల ద్వారా శిరోజాల పెరుగుదలకు తోడ్పడుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.