రోజు ఓ కప్పు పండ్లను తీసుకోవడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పండ్లలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. తద్వారా రక్తపోటు వ్వాదులను నియంత్రించవచ్చు. కిడ్నీల్లో రాళ్లు రాకుండా పండ్లు చూస్తాయి. ఇందులోని లో-కేలరీలు అధిక బరువును నియంత్రణకు తోర్పాడుతుంది.
రోజూకు పైనాపిల్ పండ్లను అరకప్పు తీసుకోవడం మచింది. దీని ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. పైనాపిల్ రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. దంత సమస్యలకు అయిర్వేదంగా పనిచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నప్పడు పైనాపిల్ను తీసుకోవడం మంచి టానిక్లా పనిచేస్తుంది. అలాగే రక్త సంబంధిత రుగ్మతలను కూడా దూరం చేస్తుంది. అనాసపండు తీనడం ద్వారా మహిళలకు వచ్చే రుతు సంబంధిత ఇబ్బందులు ఎదురవ్వవు. అలాగే అల్లనేరేడు పండ్లు మధుమేహాన్నితగ్గిస్తాయి. ఆ పండ్ల విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి రోజూ తీసుకుంటే షుగర్ అదుపులోకి వస్తుంది.
బొప్పాయి పండులో పపెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. చర్మంపై ఉన్న మృత్య కణాలను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. వీటి గుజ్జులో తేనె కానీ పెరుగు కానీ కలిపి రుద్దుకున్నా కూడా చర్మం మెరుస్తూ ఉంటుంది.అల్లనేరేడు పండ్లు మధుమేహాన్నితగ్గిస్తాయి. ఆ పండ్ల విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి రోజూ తీసుకుంటే షుగర్ అదుపులోకి వస్తుంది.దానిమ్మ పండు తప్పకుండా రోజూవారీ డైట్లో చేర్చుకోవాలి. ఇది తీనడం ద్వారా దగ్గు దూరమవుతుంది. తరచుగా వేధించే అనారోగ్య సమస్యలుండవు. రోజుకో అరటి పండు తీసుకుంటే పైల్స్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు. రోజుకో ఆపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చు అంటారు. మంచి పోషకపదార్ధాలు వాటిలో ఉంటాయి.