వాతవరణంలో వచ్చే మార్పులు.. మన చర్మ సమస్యలకు కారణం అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కాలంలో వచ్చే మార్పుల వల్ల చర్మం చాలా సమస్యల్ని ఎదుర్కొంటుంది. అందులో పాదాలు పగలటం ఓ సమస్య. ఎక్కువ మహిళలలో ఈ సమస్య కనిపిస్తు ఉంటుంది.
పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. వర్ష కాలం మరియు చలి కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
పాదాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు.
* ప్రతిరోజూ పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.
* రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.. కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.
* పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోవాలి.
* షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి.
* చెప్పులు లేకుండా నడవకూడదు. ముఖ్యంగా గులకరాళ్లు ఉన్న చోట నగ్న పాదాలతో అస్సలు నడవకూడదు.
* పాదాలపై వేడినీళ్లు గుమ్మరించుకోకూడదు.
* ఉతకని సాక్స్ ఎక్కువరోజుల పాటు వేసుకోవటం అంత మంచిది కాదు.