ఐఫోన్ కొనుగోలుదారులకు భారీ శుభవార్త
ఐఫోన్ కొనుగోలుదారులకు భారీ శుభవార్త ఐఫోన్ కొనుగోలుదారులకు భారీ శుభవార్త
జీవితంలో ఐఫోన్ వాడాలన్న కోరిక ప్రతి ఫోన్ ప్రియులకు ఉంటుంది. అటువంటి వారికోసం ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ శుభవార్త అందించింది. అమెజాన్ 'గ్రేట్ ఇండియాన్ ఫెస్టివల్' ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సేల్స్లో లో ప్రముఖమైన కంపెనీలపై పలు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. అంతేకాదు ఐఫోన్లపై కూడా భారీగా తగ్గింపు ధరలను ప్రకటించింది.
ఇందులో భాగంగా యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్పై ఏకంగా రూ.10 వేలు తగ్గించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అక్టోబర్ 28 అర్ధరాత్రి నుంచే కొనుగోలు చేసే అవకాశం లభించింది. తగ్గింపు తర్వాత ఐఫోన్ ఎక్స్ఆర్ 68 జీబీ మోడల్ ధర రూ. 39,999, 128 జీబీ వేరియంట్ రూ. 44,999, 256 జీబీ ఫోన్ రూ.57,999 ధరలకు లభిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్ పరిమిత సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని అమెజాన్ ఇండియా తెలిపింది. ఐఫోన్ ఎక్స్ఆర్ ఇంత తక్కువ ధరకు ఇంతకుముందెన్నడూ లభ్యం కాలేదని పేర్కొంది.