మన శరీరంలో ఫస్ట్ ఇంప్రెషన్ ముఖం. ఎధుటివాళ్ళకు మన స్పందనలు ముఖ కవిళకల ద్వారానే తెలుస్తోంది. కావున పేస్ ఎప్పుడు తాజాగా కనిపడేలా చూసుకోవాలి. చర్మంపై ప్రత్యేక శ్రద్ద ఉంచాలి. చర్మం పొడిబారుతోంది అంటే సరైన నిద్రకు దూరంగా ఉన్నరని అర్థం చేసుకోవాలి. రోజూ కనీసం ఎనిమిది గంటల నిద్ర లేకపోతే కళ్ల కింద నలుపు వలయాలు ఏర్పడతాయి. రాత్రి పడుకునే ముందు తేనను కళ్ల కింద ఉబ్బుగా ఉన్న చోట రాయాలి. అలాగే ముఖంపై పూర్తిగా తేనను రాసి, మృదువుగా రుద్దాలి. కొద్ది సేపటి తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయడం ద్వారా చర్మకాంతి పెరుగుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్లో ముంచిన దూదితో ముఖమంతా మర్ధన చేయాలి. మసాజ్లా కాస్త ముఖాన్ని ఒత్తిడి చేస్తూ చేయాలి. దీంతో ముఖంపైన దాగున్న దుమ్ము కణాలు, మేకప్ డస్ట్ సులువుగా పోతుంది. తర్వాత ముఖాన్ని వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలాగే మంచి పోషక ఆహారం తీసుకోవాలి. రోజు తగినంత వాటర్ను తాగుతుండాలి.