నేడు సీఈసీని కలవనున్న వైసీపీ ఎంపీల బృందం

Update: 2019-05-18 00:16 GMT

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బాట పట్టింది. ఆ పార్టీకి చెందిన పలువురు వైసీపీ మాజీ ఎంపీల బృందం నేడు (శనివారం) ఢిల్లీకి వెళ్లనుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వి.విజయసాయి రెడ్డి, మాజీ ఎంపీ బొత్స సత్యనారాయణతో పాటు పార్టీ మాజీ ఎంపీలతో కూడిన బృందం మధ్యాహ్నం 12గంటలకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను కలవనుంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ శ్రేణులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ చూసుకుని రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడింది చాలక మళ్లీ ఢిల్లీ వెళ్లి యాగీ చేస్తున్న తీరుపై వారు కమిషన్‌‌కు ఫిర్యాదు చేయబోతున్నారు. కాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలింగ్‌ రోజున, పోలింగ్‌ అనంతరం జరిగిన దాడులను ఈ సందర్భంగా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏపీ జరుగుతున్న పరిణామాలతోపాటు ఈ నెల 23న కౌంటింగ్‌ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా సక్రమంగా జరిగేలా చూడాలని ఈసీకి వినతిపత్రం సమర్పించనున్నారు.

Similar News