వైసీపీ చారిత్రక విజయం సాధిస్తుంది...కేంద్రంలో ఏ పార్టీతో....

Update: 2019-05-22 12:44 GMT

ఎన్నికల ఫలితాల్లో వైసీపీ చారిత్రక విజయం సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడుతుందన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానని చెప్పిన చంద్రబాబు తానే చక్రంలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పెండింగ్ ఫండ్స్ కోసమే టీడీపీ గెలుస్తుందని లగడపాటి సర్వేలో చెప్పారన్నారు. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ఏ పార్టీతో వైసీపీ కలిసి వెళుతుందన్న విషయం నిర్ణయిస్తామన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. 

Similar News