వివేకానంద హత్యతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తుపై సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. హత్య కేసులో అనుమానితులుగా భావిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా వివేకానందరెడ్డి హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లెటర్ ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. అసలు చనిపోతున్న సమయంలో లేటర్ ఎలా రాస్తారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా ఆ లేటర్తో తమకు ఎలాంటి సంబంధం లేదని వివేకా కారు డ్రైవర్ ప్రసాద్ భార్య కృప చెప్పారు. వైయస్ వివేకానందా తమ కుటుంబానికి చాలా ఆర్ధిక సహాయం చేశారన్నారు. అలాంటి వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గురువారం అర్థరాత్రి 11:45 కి తమ భర్త ప్రసాద్ ఇంటికి వచ్చారని శుక్రవారం పొద్దున్నే వివేకానంద అల్లుడు ఫోన్ చేసి సార్ కు బాగాలేదు వెంటనే ఇంటికి రా అని చెప్పారని తెలిపింది.