వైఎస్ షర్మిల బస్సు యాత్ర ప్రారంభం

Update: 2019-03-29 10:26 GMT

వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి, వైసీపీ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల శుక్రవారం తాడేపల్లి నుండి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి బస్సు యాత్ర ఆరంభించన షర్మిలా అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని బోటుయార్డు భూ సమీకరణ బాధిత రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటారు. తరువాత అక్కడ నుంచి ఉండవల్లి సెంటర్‌లో వైసీపీ పార్టీ కార్యకర్తలను కలుసుకుంటారు. ఇక అనంతరం పట్టణంలోని సాయిబాబా మందిరం సమీపంలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద పసుపురైతులను కలిసి వారితో మాట్లాడి, సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం నులకపేట మీదుగా డోలాస్‌నగర్‌ చేరుకుని అక్కడ మహిళా కార్యకర్తలతో ఫెస్ టు ఫెస్ కార్యక్రమం. తరువాత మంగళగిరి పట్టణానికి చేరుకుని, సాయంత్రం ఐదు గంటలకు పాతబస్టాండ్‌ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Similar News