ఏపీ మంత్రివర్గం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న ఉదయం 9.15 నిమిషాలకు కొత్తగా నియమితులయ్యే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మే 30న కొత్త సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయడంతో తాజాగా మంత్రివర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రమాణ స్వీకారం అనంతరం తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. మంత్రివర్గం ఏర్పాటుకు రంగం సిద్ధం కావడంతో వైసీపీలోని చాలా మంది బెర్తుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ జిల్లాల నుంచి పలువురి పేర్లు వినిపించినప్పటికీ ఇప్పుడిప్పుడే ఓ స్పష్టత వస్తోంది. తాజాగా వైసీపీ మంత్రి వర్గంలో చోటు దక్కించుకునే వారి జాబితా ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఆ జాబితా ఇదే..
కడప- అంజద్ భాషా, శ్రీనివాసులు
కర్నూలు- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
చిత్తూరు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అనంతపురం- అనంత వెంకటరామిరెడ్డి
నెల్లూరు- మేకపాటి గౌతమ్ రెడ్డి
ప్రకాశం- బాలినేని శ్రీనివాసరెడ్డి
గుంటూరు- ఆళ్ల రామకృష్ణా రెడ్డి, మేకతోటి సుచరిత
కృష్ణా జిల్లా- సామినేని ఉదయభాను, పేర్నినాని
తూర్పుగోదావరి- విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్
పశ్చిమగోదావరి- గ్రంథి శ్రీనివాస్, ప్రసాదరాజు
విశాఖపట్నం- ముత్యాల నాయుడు
విజయనగరం- బొత్స సత్యనారాయణ
శ్రీకాకుళం -ధర్మాన ప్రసాద రావు