ఇటివలే టీడీపీ తీర్థంపుచ్చుకున్న వంగవీటీ రాధాకృష్ట టీడీపీ గెలుపునకు కృషి చేస్తానని అలాగే ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. కాగా నేడు ఆశ్చర్యపరిచే సన్నివేశం ఒకటి వంగవీటి రాధా విషయంలో జరిగింది. నూజివీడు టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్న వంగవీటితో సెల్ఫీలు తీసుకొనేందుకు జనసేన కార్యకర్తలు పోటీ పడ్డారు. శుక్రవారం జనసేన అభ్యర్థి బసవాభాస్కర్రావు నామినేషన్కు హాజరైన జనసేన కార్యకర్తలు సెల్ఫీలు దిగడం చర్చనీయాంశంగా మారింది.