రెండో దశ ఎన్నికల్లో హింస చెలరేగింది. అల్లరిమూకల్ని అదుపుచేసే క్రమంలో పోలీసులు కాల్పులకు దిగారు. దీంతో పశ్చిమబెంగాల్లోని రాయగంజ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ సందర్భంగా కొన్ని అల్లరిమూకలు రెచ్చిపోయాయి. రాళ్లు రువ్వుతూ బీభత్సం సృష్టించాయి. దీంతో తొలుత అల్లరిమూకల్ని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులకు దిగారు.