జగన్ పద్ధతి మార్చుకోవాలి: వంగవీటి రాధా
వైసీపీలో ఎన్నో అవమానాలను భరించానని, అందుకే పార్టీకి రాజీనామా చేశానని వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు.
వైసీపీలో ఎన్నో అవమానాలను భరించానని, అందుకే పార్టీకి రాజీనామా చేశానని వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. పార్టీలో చేరేటప్పుడు తమ్ముడిలా చూసుకుంటానని చెప్పి జగన్ తనను మోసం చేశారన్నారు. నీ తండ్రి మీద జాలిచూపించి పార్టీలో ఉండనిచ్చా అని పదేపదే అనేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వదిలిస్తే గాలికి పోతానని జగన్ అనేవాడని గుర్తు చేసిన వంగవీటి రాధా ఇప్పటికైనా జగన్ తన పద్దతి మార్చుకొని తన అభిమానులను గౌరవించాలని, తనకు జరిగిన అవమానాలు మరొకరికి జరగకూడదని హెచ్చరించారు. తనను చంపేస్తామని వైసీపీ కార్యకర్తుల సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారని వంగవీటి రాధా తెలిపారు. ప్రాణం కంటే తండ్రి ఆశయసాధనే ముఖ్యమన్నారు. రంగా హత్య కొందరు వ్యక్తుల పని అని, దానిని టీడీపీకి ఆపాదించడం సరికాదన్నారు. రంగాను అభిమానించేవాళ్లు అన్ని పార్టీల్లో ఉన్నారని వంగవీటి రాధా తెలిపారు.