16వ లోక్‌సభ రద్దుకు కేంద్ర మంత్రివర్గం తీర్మానం

Update: 2019-05-24 12:48 GMT

16వ లోక్‌సభను రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 16వ లోక్‌సభను రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం ఆమోదం తెలిపిన తీర్మానాన్ని ప్రధాని మోడీ కాసేపట్లో రాష్ట్రపతికి అందజేయనున్నారు. జూన్ 3తో 16వ లోక్‌సభ కాలపరిమితి ముగియనుంది. ఈలోగానే కొత్త ప్రభుత్వం కొలువుతీరాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీన సాయంత్రం వరకు ఢిల్లీ రావాలని బీజేపీ ఎంపీలను ఆ పార్టీ నాయకత్వం ఆదేశించింది. 26న బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యే అవకాశం ఉంది.  

Similar News