కేబినేట్లో మహిళల స్థానంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై సమాధానం చెప్పే సందర్భంలో మహిళలంటే ప్రత్యేక గౌరవముందన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో తమకు ఓట్లు వేశారని అందుకే భారీ మెజార్టీతో గెలుపొందామని గుర్తు చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీగా ఓ మహిళకు కూడా అవకాశం కల్పించామన్న కేసీఆర్ ఇద్దరు మహిళలకు మంత్రులుగా అవకాశం ఉంటుందని తెలిపారు.