తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇవాళ ఉదయం 11:30 గంటలకు రాజ్భవన్ వేదికగా జరిగింది. మొత్తం 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఇంద్రకరణ్రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్రెడ్డి, ఈటెల రాజేందర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత మంత్రులకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.