సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌

Update: 2019-02-06 05:28 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని రెండవ శ్రేణి భాషా పండితులు, పీఈటీల పోస్టులను.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు భాషా పండితుల పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తామంటూ ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నారు. దాంతో తెలంగాణలో ఇకపై గ్రేడ్-2 పండిట్ల పోస్టులుండవు. ఈ నిర్ణయంతో వేలాది మంది భాషా పండితులకు మేలు జరగనుంది.

Similar News