నలుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా..ఉత్తమ్ పోటీ ఇక్కడినుంచే...
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా కాసేపట్లో విడుదల చేసింది. రెండో విడతలో నలుగురి పేర్లను ఖరారు చేశారు. నల్గొండ లోక్సభ స్థానానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ సీటుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎంపిక చేయగా నాగర్ కర్నూల్ నుంచి మాజీ ఎంపీ మల్లు రవి, వరంగల్ నుంచి సాంబయ్య పేర్లను ఖరారు చేశారు. తాజాగా నలుగురితో కలసి ఇప్పటి వరకు మొత్తం 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన 5 సీట్లకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.