ఏపీలో టీడీపీకి మరో ఎంపీ జలక్ ఇవ్వనున్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. మరోసారి పోటీకి టీడీపీ ఆయనకు స్పష్టత ఇవ్వకపోవడంతో వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆయన కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ను కలవబోతున్నారు.