ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి షాక్..

Update: 2019-03-26 16:14 GMT

విశాఖపట్నం - ఉత్తరాంధ్రా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి గాదే శ్రీనివాస్ రావు ఘోర పరాజయం పాలయ్యారు. అయితే గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచి విజయకేతనం ఎగరవేసిన శ్రీనివాసరావు ఈసారి మాత్రం ఓటమి పాలుకాక తప్పలేదు. గాదె శ్రీనివాసరావుపై పాకలపాటి రఘు వర్మ విజయం సాధించారు. అయితే మొత్తం ఓట్లలో రఘు వర్మకు 7834 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా గాదె శ్రీనివాస రావుకు మాత్రం 5632 మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో అభ్యర్థి అడారి కిషోర్‌ కుమార్‌కు 2548 ఓట్లు పడ్డాయి. అయితే టీడీపీ పట్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతతోనే ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాస రావు ఓడిపోయారని పరిశీలకులు భావిస్తున్నారు.  

Similar News