కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు టీడీపీ ఆందోళన

గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇంటి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. కాకినాడలో సీఎం చంద్రబాబును బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ టీడీపీ లీగల్ సెల్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ఎదుట బైఠాయించారు.

Update: 2019-01-05 06:23 GMT
Kanna Laxminarayana

గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇంటి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. కాకినాడలో సీఎం చంద్రబాబును బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ టీడీపీ లీగల్ సెల్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ఎదుట బైఠాయించారు. ప్రధాని మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ఎదుట టీడీపీ నేతల ధర్నా విషయం తెలుసుకుని బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీకి మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, బీజేపీ నాయకులు మధ్య వాగ్వివాదం, తోపులాటలు జరిగాయి. రెండు వర్గాలవారిని పోలీసులు సముదాయించి ప్రయత్నం చేసిణ ఫలితం లేకుండాపోయింది. కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద నుంచి టీడీపీ నాయకులను బీజేపీ కార్యకర్తలు తరమికొట్టారు.  

Similar News