పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీడీపీ నాయకుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలు సాధించే సత్తా ఒక్క వైఎస్ జగన్కే ఉందన్నారు. ఏపీ అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో పయనించాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని కృష్ణంరాజు ఆకాంక్షించారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమాని అని అలాగే జగన్ కుటుంబంతో అనుబంధం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. తటస్తులు కూడా జగన్ సీఎం కావాలంటున్నారని తెలిపారు.