ఫైనల్ లిస్ట్...25 ఎంపీ స్థానాలకు మిగిలిన అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల ప్రకటన
లోక్సభ ఎన్నికల సంబంధించి తీవ్ర కసరత్తు చేసిన టీడీపీ ఎట్టకేలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గానూ అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. దీంతోపాటు పెండింగ్లో ఉన్న 36 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. దీంతో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో నామినేషన్ల ప్రక్రియ వేగవంతం కానుంది.
ఏపీలో పోరుకు పూర్తి స్థాయిలో రెడీ అయిపోయింది టీడీపీ. మొత్తం 25 లోక్సభ స్థానాలకు గానూ అన్ని స్థానాల్లో అభ్యర్థులను పార్టీ అధినేత చంద్రబాబు అర్ధరాత్రి ఖరారు చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న 36 అసెంబ్లీ స్థానాలకూ కూడా ఆయన అభ్యర్థులను ప్రకటించారు.
ఎంపీ అభ్యర్థుల జాబితా చూస్తే.. శ్రీకాకుళం- రామ్మోహన్ నాయుడు, విజయనగరం- అశోక్ గజపతిరాజు, అరకు- కిషోర్ చంద్రదేవ్, విశాఖ- భరత్, అనకాపల్లి- ఆడారి ఆనంద్, కాకినాడ- చలమలశెట్టి సునీల్, అమలాపురం- గంటి హరీష్, రాజమండ్రి- మాగంటి రూప, నర్సాపురం- వేటుకూరి వెంకట శివరామరాజు, ఏలూరు- మాగంటి బాబు, విజయవాడ- కేశినేని నాని, మచిలీపట్నం- కొనకళ్ల నారాయణ, గుంటూరు- గల్లా జయదేవ్, నర్సారావుపేట- రాయపాటి సాంబశివరావులను ప్రకటించారు చంద్రబాబు.
ఇక బాపట్ల- శ్రీరాం మాల్యాద్రి, ఒంగోలు- శిద్దా రాఘవరావు, నెల్లూరు- బీదా మస్తాన్రావు, కడప- ఆది నారాయణరెడ్డి, హిందూపురం- నిమ్మల కిష్టప్ప, అనంతపుం- జేసీ పవన్రెడ్డి, నంద్యాల- మాండ్ర శివానంద్రెడ్డి, కర్నూలు- కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, రాజంపేట- డీకే సత్యప్రభ, తిరుపతి- పనబాక లక్ష్మి, చిత్తూరు- శివప్రసాద్ పేర్లతో జాబితా విడుదల చేశారు.
అసెంబ్లీ అభ్యర్థులు: విజయనగరం జిల్లా: నెల్లిమర్ల – పతివాడ నారాయణస్వామి నాయుడు, విజయనగరం– అదితి గజపతిరాజు, విశాఖ జిల్లా: భీమిలి–సబ్బం హరి, గాజువాక– పల్లా శ్రీనివాసరావు, చోడవరం– కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు, మాడుగుల– గవిరెడ్డి రామానాయుడు, పెందుర్తి– బండారు సత్యనారాయణమూర్తి, తూర్పుగోదావరి జిల్లా: అమలాపురం– అయితాబత్తుల ఆనందరావు, పశ్చిమగోదావరి జిల్లా: నిడదవోలు– బూరుగుపల్లి శేషారావు, నర్సాపురం– బండారు మాధవనాయుడు, పోలవరం– బొరగం శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా: తాడికొండ– తెనాలి శ్రావణ్కుమార్, బాపట్ల– అన్నం సతీష్ ప్రభాకర్, నరసరావుపేట– డాక్టర్ అరవిందబాబు, మాచర్ల – అంజిరెడ్డి, ప్రకాశం జిల్లా: దర్శి– కదిరి బాబూరావు, కనిగిరి–ముక్కు ఉగ్రనర్సింహారెడ్డి, నెల్లూరు జిల్లా: కావలి– విష్ణువర్ధన్రెడ్డి, నెల్లూరు రూరల్– అబ్దుల్ అజీజ్, వెంకటగిరి– కె.రామకృష్ణ, ఉదయగిరి– బొల్లినేని రామారావు, వైఎస్సార్ జిల్లా: కడప– అమీర్ బాబు, కోడూరు– నర్సింహప్రసాద్, ప్రొద్దుటూరు– లింగారెడ్డి, కర్నూలు జిల్లా: కర్నూలు– టీజీ భరత్, నంద్యాల– భూమా బ్రహ్మానందరెడ్డి, కోడుమూరు– బి.రామాంజనేయులు, అనంతపురం జిల్లా: గుంతకల్లు– ఆర్.జితేంద్రగౌడ్, సింగనమల– బండారు శ్రావణి, అనంతపురం అర్బన్– ప్రభాకర్ చౌదరి, కల్యాణదుర్గం– ఉమామహేశ్వర్నాయుడు, కదిరి– కందికుంట వెంకట ప్రసాద్, చిత్తూరు జిల్లా: తంబళ్ల పల్లె– శంకరయాదవ్, సత్యవేడు– జేడీ రాజశేఖర్, గంగాధర నెల్లూరు– హరికృష్ణ, పూతలపట్టు– తెర్లం పూర్ణం. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ఎంపికను పూర్తి చేసింది టీడీపీ. ఇక అభ్యర్థులు ఎంపిక పూర్తి కావడంతో నామినేషన్ల ప్రక్రియను వేగవంతం చేయనుంది టీడీపీ.