సభాపతి బాధ్యతలను త్రికరణశుధ్ధిగా నిర్వహిస్తా: తమ్మినేని

Update: 2019-06-07 11:36 GMT

ఏపీ శానససభ స్పీకర్‌గా అవకాశం దక్కడం పట్ల వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనపై నమ్మకం ఉంచి అప్పగించిన సభాపతి బాధ్యతలను త్రికరణశుధ్ధిగా నిర్వహిస్తానని తమ్మినేని తెలిపారు. తనను ఏపీ స్పీకర్‌గా ప్రతిపాదిస్తున్నట్టు సీఎం జగన్‌ తనతో చెప్పగానే చాలా ఆనందరంగా ఫీలయ్యానని, ఏ పదవి ఇచ్చినా ఆదేశంగా భావిస్తానని అన్నట్టు తెలిపారు. స్పీకర్‌ పదవికి న్యాయం చేయగలననే నమ్మకం తనకుందన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు సమన్వయంతో సభను హుందాగా నడిపిస్తానని అన్నారు. తనను ఏపీ రెండో శాసనసభాపతిగా ఎంపిక చేసినందుకు ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

Tags:    

Similar News