లోక్సభ ఎన్నికలకు ముందుగానే తమిళనాడులో పొత్తు పొడిచింది. అధికార ఏఐడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకుంది. జయలలిత మరణం తర్వాత బీజేపీకి సన్నిహితంగా ఉన్న అన్నాడీఎంకే ఎట్టకేలకు కమలంతో చేతులు కలిపింది.