కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈవీఎంలతో పాటు 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ 21 ఎన్డీఏ వ్యతిరేక పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. ఈవీఎంతో పాటు వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించాలంటూ పిటిషనర్లు వాదించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరుతూ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఈ నెల 25కు వాయిదా వేశారు. విచారణ సమయంలో సీఈసీ తరపున ఓ అధికారి హాజరుకావాలంటూ ఆదేశించింది.